కూటమికి ఓట్లేస్తే శనీశ్వరుడి ఓట్లు వేసినట్లే: హరీశ్

Update: 2018-12-01 12:50 GMT

తెలంగాణ మహాకూటమిపై ఆపద్దర్మ మంత్రి తన్నీరు హరిశ్‌రావు విమర్శలు గుప్పించారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల కేంద్రంలో  ఏర్పాటుచేసిన బహిరంగ సభకు హరిశ్ రావు పాల్గోన్నారు. ఈ సందర్బంగా హరీశ్ రావు మాట్లాడుతూ మహాకూటమిపై విరుచుకపడ్డారు. తెలంగాన ప్రజలు మహాకూటమి ఓట్లువెస్తే.. శనీశ్వరునికి వేసినట్లేనని అన్నారు. శనీశ్వరుడు కావాలా లేక కాళేశ్వరం ప్రాజెక్టు కావాలా అని ప్రజలను హరిశ్ రావు అడిగారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రం గెలిచిన మంత్రులు, ఎమ్మెల్యేలు సల్లటి ఏసి గదుల్లో ఉంటారు. అదే టిఆర్ఎస్ అధికారంలోకి వస్తే అణుక్షణం రైతుల మధ్య, ప్రజలతోనే ఉండి సేవలు చేస్తారన్నారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా టీఆర్ఎస్‌ను గెలిపించాలని కోరారు.
 

Similar News