వైసీపీలోకి మాజీ మంత్రి

Update: 2018-11-10 07:02 GMT

కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పిన  సీ.రామచంద్రయ్య తర్వలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. టీడీపీతో కాంగ్రెస్ జతకట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రామచంద్రయ్య కొద్దిరోజుల క్రితం పార్టీ పదవులకు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా  చేశారు. ఎల్లుండి నుంచి వైసీపీ అధినేత జగన్‌ చేపడుతున్న ప్రజాసంకల్ప యాత్ర  విశాఖ జిల్లాలో తిరిగి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 13న బొబ్బిలిలో జరగనున్న బహిరంగ సభలో జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరనున్నారు.

Similar News