తెలంగాణ శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. స్వల్ప ఉద్రిక్తతలు మినహా పోలింగ్ సజావుగా సాగిందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అయితే, హైదరాబాద్ పాతబస్తీలో దొంగ ఓట్ల కలకలం రేగింది. సిరా చుక్క చెరిపేసి కొందరు మహిళలు పదే పదే ఓట్లు వేశారు. చార్మినార్, చంద్రాయణగుట్ట, యకుత్ పురాల్లో ఈ సైకిలింగ్ ఓటింగ్ యదేచ్ఛగా కొనసాగింది. దొంగనోట్లపై ఎలక్షన్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.