బీజేపీని తక్కువ అంచనా వేయొద్దు: కె.లక్ష్మణ్

Update: 2018-11-30 14:48 GMT

వచ్చేనెలలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అంత తక్కువ అంచనా వేయద్దని, ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపిస్తామని టీ-బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. బీజేపీ పార్టీని ఎవరు ఎన్ని విమర్శుల చేసిన కాని అంతగా పట్టించుకొము ఎందుకంటే డిసెంబర్ 7 తారీకునా తమ సత్తాఎంటో ఆ రోజు బయటపడుతుందని వెల్లడించారు. కాగా డిసెంబర్ 3న ఎల్బీ స్టేడియంలో పెద్ద ఎత్తున నిర్వహించిన బోతున్నా బీజేపీ భారీ బహిరంగ సభకు భారతదేశ ప్రదాని నరేంద్రమోడీ హాజరుకానున్నా నేపథ్యంలో అక్కడి ఏర్పాట్లను లక్ష్మణ్, పోలీసులు, ఎస్పీజీ అధికారులు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సభకు ఎలాంటి అవాంతరాలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. ప్రధాని మోదీ సభతో తెలంగాణలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయని, ఎన్నికల్లో తమ విజయం ఖాయమని  లక్ష్మణ్ జోస్యం చెప్పారు.
 

Similar News