తెలంగాణలో టీఆర్ఎస్ గెలిస్తే ఆంధ్రలో ఎందుకు సంబరాలు చేస్తున్నారన్నారు ప్రభుత్వ విప్ డొక్కా మాణిక్య వరప్రసాద్. ఇక్కడి ఎమ్మెల్యేలు వెళ్లి టీఆర్ఎస్ నేతలను అభినందిస్తారా...? దీంతో సీమాంధ్ర ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నించారు. టీఆర్ఎస్ గెలిస్తే టపాసులు కాలుస్తూ సీమాంధ్రులకు ఏం న్యాయం చేస్తారని అన్నారు.