ఎలాగైన బీజేపీని గద్దె దించేందుకు సీఎం చంద్రబాబు, రాహుల్ తీసుకొన్న నిర్ణయాన్ని డీఎంకే స్వాగతిస్తోందని ఆ పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ స్పష్టంచేశారు. ఈ అంశంపై ఆయన శుక్రవారం వరుసగా ట్విట్టర్ వేదికగా స్పందించారు. అవినీతి, నిరంకుశ, విభజించే శక్తులు మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను ధ్వంసం చేస్తున్నాయి. బీజేపీయేతర పార్టీలన్నీ ఒకే వేదికపైకి రావల్సిన సమయమిది. ఆ దిశగా చర్యలు తీసుకున్న రాహుల్ గాంధీ, చంద్రబాబులను అభినందిస్తున్నా. వారికి నా మద్దతు’’అని స్టాలిన్ పేర్కొన్నారు.