వైసీపీ గ్రాఫ్ పెరుగుతోంది : బీజేపీ ఎమ్మెల్యే

Update: 2018-05-02 09:55 GMT

జగన్ చెప్పినట్లే.. చంద్రబాబు చేస్తున్నారంటూ తీవ్రంగా విమర్శించారు బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు. చంద్రబాబు గ్రాఫ్ పడిపోయిందని.. వైసీపీ గ్రాఫ్ పెరుగుతోందన్నారు. చంద్రబాబు చేసింది ధర్మపోరాట దీక్ష కాదని.. అధర్మ పోరాటం అన్నారు. వెంకన్న పాదాల చెంత మోడీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతున్నామన్నారు విష్ణుకుమార్‌ రాజు. చంద్రబాబు నాయుడు అసత్య ప్రచారం చేస్తున్నారన్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం ఖాయమన్నారు.

Similar News