టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ ఎట్టకేలకు ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసినట్లు తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీ వెళ్లిన కేసీఆర్తో డీఎస్ సమావేశమైనట్లు చెబుతున్నారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ డీఎస్పై ఆరోపణలు రావడం, అదే సమయంలో డీఎస్పై చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ టీఆర్ఎస్ నేతలు కేసీఆర్కు ఫిర్యాదుచేశారు. అయితే హైదరాబాద్లో కేసీఆర్ను కలిసేందుకు అనేకమార్లు డీఎస్ ప్రయత్నించినా అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో సీఎం ఢిల్లీ టూర్లో కలిసి వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.