భారత వెటరన్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ క్రియాశీలక రాజకీయాల్లోకి రానున్నాడనే వార్త హల్చల్ చేస్తోంది. పేలవ ఫామ్ కారణంగా జట్టులో చోటు కోల్పోయిన ఈ ఢిల్లీ బ్యాట్స్మెన్ గత రెండేళ్లుగా టీమిండియాకి దూరంగా ఉంటున్నాడు. ప్రస్తుతం భారత జట్టులో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, మురళీ విజయ్ రూపంలో మూడు ఫార్మాట్లలో కలిపి నలుగురు రెగ్యులర్ ఓపెనర్లు అందుబాటులో ఉన్నారు. ఈ నేపథ్యంలో 36 ఏళ్ల గౌతమ్ గంభీర్ మళ్లీ టీమిండియాలోకి పునరాగమనం చేయడం కష్టమని భావించే.. రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ఈ ఓపెనర్ను కలిసిన ఢిల్లీ బీజేపీ నేతలు అతనికి టికెట్ ఇవ్వడంపై కూడా స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. దేశ రాజధాని ఢిల్లీ నుంచే గంభీర్ను బరిలోకి దింపాలని బీజేపీ చూస్తున్నది. దేశానికి సంబంధించి ఏ అంశంపై అయినా స్పందించడానికి గంభీర్ ఎప్పుడూ ముందే ఉంటాడు. ఈ విషయంలో గంభీర్కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగే ఉంది. ఇది తమకు ఉపయోగపడుతుందని భావిస్తున్న బీజేపీ.. గౌతీని బరిలోకి దింపడానికి సిద్ధమవుతున్నది.