కాంగ్రెస్ మూడో జాబితా విడుదల

Update: 2018-11-17 05:37 GMT

కాంగ్రెస్ పార్టీ మూడో జాబితాను విడుదల చేసింది. 13 మంది అభ్యర్థుల పేర్లతో జాబితాను విడుదల చేసింది. ఇందులో బోథ్ నుంచి  సోయం బాపూరావు, నిజామాబాద్ అర్బన్ నుంచి  తాహేర్ బిన్ హమ్‌దాన్, నిజామాబాద్ రూరల్ నుంచి డాక్టర్ రేకుల భూపతిరెడ్డి, బాల్కొండ నుంచి ఇ.అనిల్‌కుమార్, ఎల్‌.బి.నగర్ నుంచి డి.సుధీర్‌రెడ్డి, కార్వాన్ నుంచి ఒసామాబిన్ మహ్మద్ అలీ హజ్రీ, యాకుత్‌పురా నుంచి కె.రాజేంద్రరాజు, బహుద్దూర్‌పురా నుంచి కాలెం బాబా, కొల్లాపూర్ నుంచి బీరం హర్షవర్ధన్‌రెడ్డి, దేవరకొండ నుంచి బాలు నాయక్, తుంగతుర్తి నుంచి అద్దంకి దయాకర్, జనగాం నుంచి పొన్నాల లక్ష్మయ్య, ఇల్లెందు నుంచి బాణోత్ హరిప్రియ నాయక్ పేర్లు ఖారరయ్యాయి. 

ఇప్పటికే రెండు జాబితాను ప్రకటించిన కాంగ్రెస్ తాజాగా మరో జాబితాను విడుదల చేసింది. తొలి జాబితాలో 65 మంది, రెండో జాబితాలో 10 మంది, మూడో జాబితాలో 13 మంది అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ఖారారు చేసింది. దీంతో కాంగ్రెస్ అభ్యర్థుల సంఖ్య 93కు చేరింది. మరో స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. 

Similar News