హైకోర్టు ఇచ్చిన తీర్పు సీఎం కేసీఆర్కు చెంపపెట్టని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సోమవారం న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫిరాయింపు ఎమ్మెల్యేలతో ఎలా పిటిషన్ వేయిస్తారని ప్రశ్నించారు. రాజ్యాంగం, న్యాయ వ్యవస్థపై సీఎం కేసీఆర్కు నమ్మకం లేదని ఆయన విమర్శించారు. కోర్టు తీర్పు అనుకూలంగా ఉన్నా.. తమ నాయకులే తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎమ్మెల్యేలను కాపాడుకోవాల్సిన బాధ్యత సీఎల్పీ లీడర్గా జానారెడ్డిపై ఉందన్నారు. తమ పదవులను పునరుద్దరించకుంటే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామాలకు సిద్ధం కావాలన్నారు కోమటి రెడ్డి. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాలు చేసి, ఉప ఎన్నికలకు సిద్ధంకావాలని పిలుపునిచ్చారు.