సోమవారం ఉదయం అసెంబ్లీలో జరిగిన ఘటనకు సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత జీవన్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిన్నటి టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో తమపై కుట్ర జరిగిందని ఆయన ఆరోపించారు. నిరసన తెలిపితే సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తామని ఎల్పీ భేటీలో సీఎం ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర మొదటి పౌరుడు గవర్నర్కు ఎంతో బాధ్యత ఉంటుందని అన్నారు. గవర్నర్కు డిసిప్లేన్ ఉండదా? ఆయన సభకు ఆలస్యంగా ఎలా వస్తారని జీవన్ రెడ్డి నిలదీశారు.