ఆమనగల్లు మండలంలోని జంగారెడ్డిపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డిపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. ఆయనపై దాడి చేసిన ఈ ఘటనలో వాహనం అద్దాలు పగిలాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తీవ్రంగా గాయపడ్డ వంశీచంద్ రెడ్డిని హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు. పోలింగ్ బూత్ను పరిశీలించడానికి వెళ్లిన ఆయనపై బీజేపీ నాయకులు దాడి చేసినట్టు సమాచారం.