దీక్ష విరమించిన సీఎం రమేశ్.. చంద్రబాబు ఏం చెప్పారు..?

Update: 2018-06-30 09:23 GMT

కడప ఉక్కు పరిశ్రమ కోసం గత 11 రోజులుగా దీక్ష చేస్తున్న సీఎం రమేష్ దీక్ష విరమించారు. ఉక్కు పరిశ్రమ సాధించే వరకు పోరాడతామంటూ సీఎం చంద్రబాబు హామి ఇవ్వడంతో ఆయన దీక్ష విరమణకు అంగీకరించారు.  సీఎం చేతుల మీదుగా నిమ్మరసం అందుకున్న అనంతరం దీక్ష విరమించారు. బీటెక్ రవితో  కలసి ఈ నెల 20న దీక్షకు దిగిన సీఎం రమేష్  స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు దీక్ష విరమణ లేదని ప్రకటించారు. శరీరంలో కిటోన్ లెవల్స్ పెరుగుతున్నాయంటూ వైద్యులు హెచ్చరించినా ఏ మాత్రం పట్టించుకోకుండా దీక్ష కొనసాగించారు. ఒక దశలో కుటుంబ సభ్యులు కోరినా దీక్ష విరమించని సీఎం రమేష్ కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు చంద్రబాబు హామీ ఇవ్వడంతో 11 రోజుల తరువాత దీక్ష విరమణకు అంగీకరించారు.  

Similar News