ప్రధాని మోడీతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. లోక్ కల్యాణ్ మార్గ్లోని ప్రధాని నివాసంలో మోడీతో కేసీఆర్ సమావేశం అయ్యారు. రెండో దఫా ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారిగా ప్రధానిని కలుస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ అంశాలపై చర్చించే అవకాశం ఉంది. రాష్ట్ర విభజన హామీలు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా, రిజర్వేషన్ల పెంపు బిల్లుపై సత్వర నిర్ణయం వంటి అంశాలపై కేసీఆర్ ప్రధానితో చర్చిస్తారు. అలాగే నూతన సచివాలయం, ఎక్స్ ప్రెస్ హైవేల నిర్మాణాలకు కావాల్సిన రక్షణ శాఖ భూముల కేటాయింపుపై కూడా ప్రధానితో చర్చించే అవకాశం ఉంది.