ఒకే నియోజకవర్గంలో చంద్రబాబు, జగన్‌

Update: 2018-04-10 07:08 GMT

ఏపీ సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన‌ ఒకే నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. మంగళగిరిలోని సీకే కన్వెన్స్ హాల్లో మూడు రోజుల పాటు జరిగే హ్యాపి సిటీ సెమినార్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు సీఆర్డీఏ, సీఐఐ, లివబుల్ సిటీస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు వివిధ దేశాల ప్రతినిధులతో ప్రతిష్టాత్మక సంస్ధల అధినేతలు రానున్నారు.  

ఇక ఇదే సమయంలో ప్రతిపక్ష నేత జగన్ కూడా మంగళగిరిలోనే పర్యటిస్తున్నారు.  ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా జగన్‌ పాదయాత్ర మంగళగిరి చేరుకుంది. భోజన విరామ అనంతరం ఈ మధ్యాహ్నం నిర్వహించే చేనేత సదస్సులో జగన్ పాల్గొనున్నారు. ఇందుకోసం ఇప్పటికే పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇద్దరు నేతలు ఒకే నియోజకవర్గంలో అది  కూడా ‎ఒకే ప్రాంతంలో పర్యటిస్తూ ఉండటంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.  

Similar News