ప్రపంచంలోనే పెట్టుబడులకు ఏపీ గమ్యస్థానంగా ఉందని సీఎం చంద్రబాబు చెప్పారు. విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సులో మాట్లాడిన సీఎం చంద్రబాబు వ్యవసాయం, అనుబంధ పరిశ్రమలపై దృష్టి పెట్టామని, ఆ రంగంలో 25.6 శాతం అధిక వృద్ధిని సాధించామన్నారు. విశాఖ, చెన్నై కారిడార్పై దృష్టి పెట్టామని, ఆటోమొబైల్, ఫుడ్ ప్రాసెసింగ్, ఇతర పరిశ్రమలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ఏపీలో పరిశ్రమల ప్రోత్సాహానికి వీలుగా విద్యుత్ ఛార్జీలు పెంచబోమని స్పష్టం చేశారు.