ఖమ్మం సభలో చంద్రబాబు కేసీఆర్కు సవాల్ విసిరారు. మోడీతో ఉంటావో ఎన్డీఏ వ్యతిరేక కూటమితో కలిసి వస్తారో తేల్చుకోవాలన్నారు. దేశంలో రెండే రెండు ఫ్రంట్లు ఉన్నాయని.. ఒకటి ఎన్డీయే ఫ్రంట్, రెండోది ఎన్డీయే వ్యతిరేక ఫ్రంట్ అని, ఎవరు ఎటువైపు ఉన్నారో తేల్చుకోవాల్సిన సమయం ఆసననమైందని, కేసీఆర్ ఎక్కడుంటారో చెప్పాలని, ఎంఐఎం ఎక్కడుంటుందో తెలపాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. డిసెంబర్ 10న ఢిల్లీలో ఎన్డీఏ వ్యతిరేక పక్షాలతో సమావేశముందని చెప్పిన చంద్రబాబు దేశవ్యాప్త కూటమి ఏర్పాటుపై ఆ సమావేశం లో నిర్ణయం తీసుకుంటామన్నారు.