నిజామాబాద్ నందిపేటలో చిన్నారి కిడ్నాప్ కలకలం రేపుతోంది. గీతా కాన్వెంట్ స్కూల్లో యూకేజీ చదువుతున్న ఆరేళ్ల మల్లీశ్వరిని గుర్తు తెలియని మహిళ కిడ్నాప్ చేసింది. చిన్నారి కిడ్నాప్ మిస్టరీ వీడకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వన్నెల్ గ్రామానికి చెందిన రమేష్, హరిత దంపతుల రెండో కూతురైన మల్లీశ్వరీ నిన్న స్కూల్ కి వెళ్లి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాప కనిపించకపోవడంతో కంగారుపడ్డ తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికినా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
మరోవైపు స్కూల్ యాజమాన్యం మాత్రం తమకు ఎలాంటి సంబంధం లేదని మధ్యాహ్నభోజనం సమయంలోనే గుర్తు మహిళ పాపను తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. తండ్రి రమేష్పై కోపంతో చిన్నారి మల్లీశ్వరిని కిడ్నాప్ చేసి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి నుంచి పాప కనిపించకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.