ఇబ్రహీంపట్నం టీడీపీ అభ్యర్థికి కొత్త తలనొప్పి వచ్చింది. మహాకూటమి సీట్ల పంపకంలో భాగంగా ఇబ్రహీంపట్నం అసెంబ్లీ స్థానాన్ని టీడీపీకి కేటాయించారు. ఇబ్రహీంపట్నం టీడీపీ అభ్యర్థి సామ రంగారెడ్డి మీద హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. సామ రంగారెడ్డిపై ఐపీసీ 420, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదైంది. మాదాపూర్లో కోట్ల విలువైన భూమిని ఫోర్జరీ సంతకాలతో కాజేసినట్టు వ్యాపారి లక్ష్మారెడ్డి ఫిర్యాదు చేశారు. నాంపల్లి సబ్రిజిస్టార్ ఆఫీసులో ఫోర్జరీ చేసినట్టు ఫిర్యాదులో వివరించారు.