తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం

Update: 2018-03-25 05:55 GMT

చిత్తూరు జిల్లా పేరూరు మండలం పాతకాల్వ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. తమిళనాడు సేలం నుంచి తిరుపతి వస్తున్న తమిళనాడు ఆర్టీసీ బస్సు రేణిగుంట చంద్రగిరి మార్గంలో అదుపుతప్పి  20 అడుగుల లోతు గొయ్యిలో పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా ఇద్దరు మృతిచెందారు. మరో పదిమందికి గాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం తిరుపతి ఆస్పత్రికి తరలించారు. బస్సును క్రేన్ సహాయంతో పైకి తీసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. క్షతగాత్రుల్లో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Similar News