హైదరాబాద్ బంజారాహిల్స్లో జరిగిన కిడ్నాప్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇచ్చిన డబ్బు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్న మాజీ ప్రియురాలిపై ప్రేమికుడితో పాటు అతని గర్ల్ ఫ్రెండ్ విచక్షణంగా రహితంగా దాడి చేశారు. వ్యభిచారం చేయాలంటూ బలవంతం చేసి తీవ్రంగా గాయపరిచారు. హైదరాబాద్ బంజారాహిల్స్లో దారుణం చోటుచేసుకుంది. గుంటూరుకు చెందిన సమీరా అనే యువతి పబ్లో ఉండగా మాజీ ప్రియుడు, అతని గర్ల్ ఫ్రెండ్ బ్లేడ్తో దాడి చేసి కిడ్నాప్కు పాల్పడ్డారు. బలవంతంగా కారులో ఇంటికి తరలించి ఇంట్లో నిర్భందించారు. వ్యభిచారం చేయాలంటూ రెండు రోజుల చిత్రహింసలు పెట్టారు.
రెండు రోజుల తరువాత ఫిరోజ్ ఇంటి నుంచి తప్పించుకున్న సమీరా పోలీసులను ఆశ్రయించింది. పథకం ప్రకారం తనపై దాడి చేసి తనును గాయపరిచారంటూ ఫిర్యాదు చేసింది. ఫిరోజ్ అతని గర్ల్ ఫ్రెండ్ కీర్తిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కోరింది. గతంలో ఓసారి ఫిర్యాదు చేసినా రాజకీయ నేతల పేర్లు చెప్పుకుని తప్పించుకుంటున్నారంటూ పోలీసులకు వివరించింది. ఈ వ్యవహారంలో ఇరువురి ప్రమేయం అనుమానాస్పదంగా ఉందని భావిస్తున్న పోలీసులు పూర్తి స్ధాయిలో దర్యాప్తు చేపట్టారు. పరారిలో ఉన్న ఫిరోజ్ అతని గర్ల్ ఫ్రెండ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.