జైలుకు ఎవరు వెళ్లాలో చంద్రబాబే చెప్పాలి: సోమువీర్రాజు

Update: 2018-02-23 07:36 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబుపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇప్పుడు ప్రత్యేక హోదా పాట పాడుతున్న సీఎం గతంలో హోదా కంటే ప్యాకేజీనే మంచిదని అన్నారని గుర్తు చేశారు. హోదాకు, ప్యాకేజీకి మధ్య 3 వేల కోట్లే తేడా ఉందంటూ లెక్కలు చెప్పారని తెలిపారు. ప్రత్యేక హోదా అంటే జైలుకు పంపిస్తానని చంద్రబాబు అన్నారనీ ఇప్పుడు ఎవరు జైలుకు వెళ్లాలో చెప్పాలని సోము వీర్రాజు ప్రశ్నించారు. హోదా ఇచ్చిన ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధి జరగలేదని స్వయంగా చంద్రబాబే అన్నారని ఎమ్మెల్సీ ప్పుకొచ్చారు. 

Similar News