ఘోర ప్రమాదం: బైక్‌తో సహా కాలిబూడిదైన యువకుడు

Update: 2018-12-26 10:28 GMT

కర్ణాటక కోలార్ జిల్లాలోని బంగారుపేట రోడ్డుపై ఇవాళ ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి తిరుపతి వస్తున్న వ్యక్తి నడిరోడ్డుపై సజీవదహనం అయ్యాడు. ప్రమాదం జరిగిన తీరు స్థానికులను తీవ్ర భయభ్రాంతులకు గురిచేసింది. బైక్ పై నీరజ్(21) అనే యువకుడు తన స్నేహితునితో కలిసి వెళ్తున్నాడు. బంగారుపేట రోడ్డు మార్గంలో దట్టమైన పొగమంచు ఉండడంతో ఎదురుగా వచ్చే వాహనాలు అంతగా కనిపించలేదు. దీంతో వేగంగా వెళ్తున్న నీరజ్ బైక్ అదుపుతప్పి ప్రయివేటు బస్సును ఢీకొట్టింది. ఒక్కసారిగా బైక్ లో మంటలు చెలరేగి నీరజ్ కు అంటుకున్నాయి. నీరజ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, అతని స్నేహితుడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే బైక్ ను వేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్ధారించారు.

Similar News