శీతాకాల పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి నిధుల కేటాయింపుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రశ్నోత్తరాల్ని లేవనెత్తారు. ఈ ప్రశ్నోత్తరాలపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. అమరావతి నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం రూ.3,324కోట్లు కావాలని ప్రపంచ బ్యాంకును కోరినట్లు తెలిపారు. ఈ రుణంపై వరల్డ్ బ్యాంక్ పరిశీలిస్తుందని చెప్పారు. ఈ పరిశీలన పూర్తయిన వెంటనే రాష్ట్రానికి అడిగిన నిందులు మంజూరు అవుతాయని సూచించారు. ఇదిలా ఉంటే కేంద్రం ఏపీ రాజధాని అమరావతిలో అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు నిర్మాణానికి కేంద్రం ఇప్పటికే రూ. 1500 కోట్లు ఇచ్చిందని చెప్పారు.