అయేషామీరా హత్య కేసు కీలకమలుపు తీసుకుంది. సిట్ విచారణపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన హైకోర్టు ధర్మాసనం కేసు విచారణను సీబీఐకి అప్పగించింది. కేసును మొదటి నుంచి విచారించాలని కేంద్ర దర్యాప్తు సంస్ధను ఆదేశించింది. విచారణ సందర్భంగా కేసు ఫైల్ మాయం అయ్యిందంటూ సిట్ బృందం చెప్పడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్యాప్తు తీరును తీవ్రంగా ఆక్షేపించిన హైకోర్టు తక్షణమే విచారించాలంటూ సీబీఐని ఆదేశించింది. 2007 డిసెంబర్ 26న విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలోని ఓ హాస్టల్లో అయేషా మీరా హత్యకు గురైంది.