పదే పదే అలా అనొద్దు నేతలకు బాబు సూచన

Update: 2018-11-22 12:03 GMT

పదే పదే తాను ప్రధాన మంత్రి అవుతానని ఎఒక్కరు నోరుజారోద్దని ఏపీ సీఎం నారా చంద్రబాబు టీడీపీ నేతలకు సూచించారు. ఇలాంటి మాటల వల్లే తీవ్రంగా నష్టపోవాల్సివస్తది, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా పార్టీకి నష్టంమే తప్ప లాభం అయితే నయాపైసా ఉండదని అన్నారు. ఎంతో పట్టుదలతో జాతీయ స్థాయిలో బీజేపీయేతర పార్టీలను ఏకం చేసేందుకు తాను చేస్తున్న యత్నంలో ఇలాంటి మాటలు మాట్లాడడం చాలా ఇబ్బంది గురిచేస్తుందని కార్యకర్తలకు సూచించారు. మన ల‍క్ష్యం కేవలం కూటమితో బీజేపీని గద్దదింపలి కాని ఇలా ఎక్కడపడితే అక్కడ తాను ప్రధాని అని నినాధాలు చేయ్యోద్దని చెప్పారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి బుధవారం టీడీపీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ కమిటీ బాధ్యులతో ఆయన టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. తెలంగాణలో ఎమ్మెల్యేలను ఊళ్లలోకి రానివ్వని దుస్థితి దాపరించిందని దినికి గల కారణం స్వయంకృతాపరాధమే కారణమని స్పష్టం చేశారు. 
 

Similar News