కేసీఆర్, ప్రధానిల భేటిపై ఏపీ సీఎం చంద్రబాబు ప్రశ్నలు సంధించారు. నిన్నటి వరకు ప్రాంతీయ పార్టీలతో చర్చలు జరిపిన కేసీఆర్ ఇప్పుడెందుకు ప్రధానిని కలుస్తున్నారని ప్రశ్నించారు. ఫ్రంట్ అంటూ పర్యటనలు చేస్తూ ప్రధానిని కలుస్తున్నారంటే అర్ధం ఏంటన్నారా ? ప్రధానితో ఏం చెబుతారు ? బ్రీఫింగ్ చేయడానికి వెళుతున్నారా ? లేక సమస్యలు చెప్పడానికి వెళుతున్నారా ? అంటూ ప్రశ్నలు గుప్పించారు. అమరావతిలో శ్వేతపత్రాల విడుదల సందర్భంగా చంద్రబాబు ఈ ప్రశ్నలు సంధించారు.