గుంటూరు జిల్లా నాగార్జున వర్సిటీ ఎదురుగా ఉన్న బైబిల్ మిషన్ ప్రాంగణంలో ప్రకృతి వ్యవసాయ సదస్సును సీఎం చంద్రబాబు ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద బాబు, ప్రకృతి వ్యవసాయ పితామహుడు సుభాష్ పాలేకర్ పాల్గొన్నారు. ఈ సదస్సు నేటి నుంచి 10 రోజుల పాటు జరగనుంది. ఆంధ్ర, తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున రైతులు ఈ సదస్సుకు హాజరయ్యారు. సుమారు రెండు వేల మంది మహిళా రైతులు పాల్గొన్నారు.