ప్రకృతి వ్యవసాయ సదస్సు ప్రారంభించిన సీఎం

Update: 2018-12-08 07:41 GMT

గుంటూరు జిల్లా నాగార్జున వర్సిటీ ఎదురుగా ఉన్న బైబిల్‌ మిషన్‌ ప్రాంగణంలో ప్రకృతి వ్యవసాయ సదస్సును సీఎం చంద్రబాబు ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద బాబు, ప్రకృతి వ్యవసాయ పితామహుడు సుభాష్ పాలేకర్ పాల్గొన్నారు. ఈ సదస్సు నేటి నుంచి 10 రోజుల పాటు జరగనుంది. ఆంధ్ర, తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున రైతులు ఈ సదస్సుకు హాజరయ్యారు. సుమారు రెండు వేల మంది మహిళా రైతులు పాల్గొన్నారు.

Similar News