ఏపీ వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ప్రారంభం

Update: 2018-07-11 08:21 GMT

పేద‌వాడి కడుపు నింపే ఉద్దేశంతో ఏపీ సర్కారు అన్న క్యాంటీన్ లకు శ్రీకారం చుట్టింది.  విజయవాడ  భవానీపురంలో మొదటి కేంద్రాన్ని  సీఎం చంద్రబాబునాయుడు ప్రారంభించారు. అనంతరం అధికారులతో కలిసి బోభనం చేశారు. అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనానికి పూటకు 5 చొప్పున వసూలు చేయనున్నట్లు తెలిపారు. తక్కువ ధరకే రుచికరమైన ఆహారాన్ని అందించడానికి ప్రభుత్వం వీటిని ఏర్పాటుచేస్తోందన్నారు. కార్పొరేట్ రెస్టారెంట్ల స్ధాయిలో క్లాస్‌ లుక్‌తో కనిపించేలా అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నామని అన్నారు.

Similar News