పంజాబ్ రాష్ట్రం నిరసనతో అట్టుడికింది.శిరోమణి అకాలీ దళ్ ఆందోళన బాట పట్టింది. కాంగ్రెస్ అద్యక్షుడు రాహుల్ గాంధీ, నవజ్యోత్ సింగ్ సిద్ధుతో పాటు, పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్, పార్టీ చీఫ్ సునీల్ జకాల్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. పంజాబ్లో 117 నియోజక వర్గాల్లో కూడా ఈ నిరసనలు కొనసాగాయి. 2015లో ఫరీద్ కోట్ ఘటనకు బాదల్ వర్గీయులే కారణమని కాంగ్రెస్ ఆరోపించడంతో నిరసనలు ఊపందుకున్నాయి.