అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

Update: 2018-11-23 10:47 GMT

తాను సీఎం ఎందుకు కాకూడదంటూ గతంలో వ్యాఖ్యానించి కలకలం రేపిన ఎంఐఎం నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం దయ ఉంటేనే ఎవరైనా సీఎంగా ఉండగలరని లేదంటే పక్కకు తప్పుకోవాల్సిందేనని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ పాతబస్తీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అక్బరుద్దీన్ ఎంఐఎం తలుచుకుంటే ఎవరినైనా ముఖ్యమంత్రి చేయగలదని అన్నారు. తమ దగ్గరికి వచ్చి ఎవరైనా తలవంచాల్సిందేనని చెప్పారు. చంద్రబాబు మొదలు నేటి కేసీఆర్ వరకు అందరూ ఎంఐఎం చెప్పుచేతల్లో ఉన్నవారేనని అన్నారు. తాను బాద్షాని కాదనీ అయితే కింగ్ మేకర్‌ని మాత్రం తానే అని అక్బరుద్దీన్ వ్యాఖ్యానించారు. డిసెంబర్ 11వ తేదీన ఎవరిని అధికార పీఠం మీద కూర్చోబెడతామో చూడండని కార్యకర్తలను ఉద్దేశించి అక్బరుద్దీన్ అన్నారు.
 

Similar News