మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..21 మంది మృతి

Update: 2018-04-18 07:24 GMT

మధ్యప్రదేశ్‌లోని శిధి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అమేలియా సమీపంలోని జోగ్దాహా దగ్గర పెళ్లి బృందంతో వెళుతున్న ట్రక్కు వంతెనపై నుంచి నదిలో పడింది.  ఈ ఘటనలో 21 మంది చనిపోగా 30 మంది వరకు గాయపడ్డారు.  70 అడుగుల పై నుంచి ట్రక్కు పడటంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ప్రమాదం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని హుటాహుటినా స్ధానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. మరణించిన వారికి రెండు లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి 50 వేల పరిహారాన్ని  ప్రకటించారు. 

Similar News