Cyclone updates: కొద్దిసేపట్లో తీరం దాటనున్న తీవ్ర వాయుగుండం.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష హెచ్చరికలు..

హైదరాబాద్...

-పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

-తీవ్ర వాయుగుండము ఇవాళ ఉదయం ఉత్తర ఆంధ్రప్రదేశ్​ తీరం నర్సాపూర్​, విశాఖ మధ్య కాకినాడ దగ్గరలో తీరాన్ని దాటే అవకాశం ఉంది.

-తుపాను తీరం దాటే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో పెనుగాలులతో పాటు కొన్నిచోట్ల కుంభవృష్టిగా వర్షాలు కురుస్తాయి.

-తుపాను తీరం దాటే సమయంలో గంటకు 55కిలో మీటర్ల నుంచి 65 కిలో మీటర్ల ..గరిష్టంగా 75 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది

-మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.

-బంగాళాఖాతంలో మరో అల్పపీడనం బుధవారం ఏర్పడే అవకాశాలున్నాయి.

-దాని ప్రభావం ఎలా ఉంటుందనేది రెండురోజుల తరవాతే తెలుస్తుంది.

-వాతావరణ అధికారి రాజారావు@హైదరాబాద్.. 

Update: 2020-10-13 03:12 GMT

Linked news