Coronavirus: మల, మూత్రాల నుంచి కరోనా వైరస్ విసర్జితమవుతుంది.

- మల, మూత్రాల నుంచి కరోనా వైరస్ విసర్జితమవుతుంది.

- హైదరాబాద్లో మురుగు నీటిని పరీక్షించిన సీసీఎంబీ

- వ్యాధి సోకిన వారి నుంచి సుమారు 35 రోజుల వరకూ విసర్జితాల్లో వైరస్ ఉంటుంది.

- ఈ పరిశీలనల వల్ల నెలరోజుల్లో ఎందరికి వ్యాధి సోకిందో గుర్తించవచ్చు

- హైదరాబాద్లో 1800 మిలియన్ల నీటిలో 40 మురుగు నీటిని శుభ్ర పరుస్తారు

- సీసీఎంబీ, ఐఐసీటీలు కలసి పరిశోధన చేశాయి

- మురుగు నీటిలో వైరస్ ఉంది కానీ, అది శుద్ధి చేసిన తరవాత వైరస్ లేదు

- మురుగు నీటిలో వైరస్ వల్ల వేరే వారికి వ్యాధి రాదు

- ఈ పరీక్షలు 80 శాతం మురుగునీటి కేంద్రాల్లో చేశారు. దాని ఆధారంగా సుమారు 2 లక్షల మందికి వైరస్ వచ్చినట్టు అంచనా.

- n40 శాతం మురుగు నీరే శుద్ధి చేస్తారు కాబట్టి, ఆ ప్రకారం లెక్కిస్తే సుమారు 6.6 లక్షల మంది హైదరాబాదీలకు వైరస్ సోకి తిరిగి కోలుకుని ఉంటారని అంచనా.

- ఈ పరిశోధనలను మెడ్ రెక్సివ్ లో ప్రచురించారు.

- లక్షణాలు లేకుండా ఎక్కువ మందిలో వైరస్ ఉంటోంది.

- వ్యాధి తీవ్రత ఉన్న ప్రాంతాలను గుర్తించడం ద్వారా సరైన చర్యలు తీసుకోవడానికి ఈ పరిశోధన ఉపయోగపడుతుందని సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ అన్నారు

Update: 2020-08-19 11:55 GMT

Linked news