AP Parishad Elections 2021 Live Updates: తూ.గో జిల్లా గున్నేపల్లి

తూర్పుగోదావరి జిల్లా:

గున్నేపల్లి:

తూర్పుగోదావరి జిల్లా గున్నేపల్లి పోలింగ్‌ కేంద్రం దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. జనసేన అభ‌్యర్థి గుర్తు లేకుండా బ్యాలెట్స్‌ పేపర్స్‌ ఉండటంతో.. జనసేన కార్యకర్తలు ఆగ్రహించారు. పోలింగ్‌ సిబ్బందితో ఘర్షణకు దిగారు. అదేవిధంగా పోలింగ్‌ కేంద్రంలోని ఫర్నీచర్‌ను కూడా ధ్వంసం చేశారు జనసేన కార్యకర్తలు. ఇక ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలింగ్‌ నిలిచిపోవడంతో.. జనసేన కార్యకర్తలతో పోలీసులు చర్చిస్తున్నారు.

Full View


Update: 2021-04-08 06:04 GMT

Linked news