Andhra Pradesh Bandh Live Updates: కృష్ణా జిల్లా

కృష్ణా జిల్లా:

కృష్ణా జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కైకలూరులో వైసీపీ, టీడీపీల మధ్య ఫ్లెక్సీ వివాదం చోటుచేసుకుంది. రాష్ట్ర బంద్‌ పిలుపుతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ కార్యకర్తలు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే జయమంగల వెంకటరమణ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. 

Update: 2021-03-05 07:27 GMT

Linked news