Andhra Pradesh Bandh Live Updates: అనంతపురం జిల్లా

 అనంతపురం జిల్లా:

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన ఏపీ బంద్ అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది. వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, కార్మిక, ఉద్యోగ సంఘాలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగాయి. అనంతపురం నగరంలో ఆందోళనకారులు ర్యాలీ చేపట్టారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ జరిగినా బయటి వ్యక్తులు ఎవరిని విశాఖ లో అడుగుపెట్టనివ్వమని ఆందోళనకారులు హెచ్చరిస్తున్నారు.

Update: 2021-03-05 07:24 GMT

Linked news