విశాఖకు చేరిన వందే భారత్ 2 విమానాలు

* భారత ప్రభుత్వ వందే భారత్-2 లో భాగంగా అబుదాబి నుంచి విశాఖ విమానాశ్రయానికి విమానం చేరింది.

* రాత్రి అబుదాబి నుంచి 148 మంది ప్రయాణికులు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు.

* ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు 13 జిల్లాలకు చెందిన ప్రవాసాంధ్రులు, విద్యార్థులు ఉన్నారు.

* ప్రయాణీకులకు ఎయిర్ పోర్ట్ లో కోవిడ్ పరీక్షలు, ఇమిగ్రేషన్, ఇతర పరీక్షలు, తరవాత ఎయిర్ పోర్ట్ వెలుపలికి పంపనున్నట్లు ఎయిర్ పోర్ట్ అథారిటీ తెలిపింది.

* వారి సొంత జిల్లాలకు దింపడానికి సిద్ధంగా ఉంచిన 13 బస్లు, ఎస్కార్ట్ సిబ్బంది ప్రభుత్వ అధికారులు సిద్ధం చేశారు.

* మనిలా నుంచి విశాఖ చేరుకోనున్న మరో విమానం.

* మనీలా (ఫిలిప్పీన్స్) నుండి విశాఖపట్నం ఎయిరిండియా ప్రత్యేక విమానంలో చేరుకున్న 166 మంది తెలుగువారు.

* వచ్చిన వారిలో ఎనిమిది మంది విశాఖ వారు మిగతా 158 మంది ఏపీలో ఇతర జిల్లా వారు ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.




Update: 2020-05-20 03:40 GMT

Linked news