వైఎస్ రాజారెడ్డికి కుటుంబసభ్యుల నివాళి
వైఎస్ రాజారెడ్డి 22వ వర్ధంతి సందర్భంగా ఆయనకు కుటుంబసభ్యులు శనివారం ఘనంగా నివాళులు అర్పించారు.
- పులివెందుల రాజారెడ్డి ఘాట్లోని వైఎస్ జయమ్మ, రాజారెడ్డి సమాధుల వద్ద వైఎస్సార్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మతో పాటు కుటుంబసభ్యులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
- అనంతరం రాజారెడ్డి మెమోరియల్ పార్కులోని ఆయన విగ్రహం వద్ద అంజలి ఘటించారు. జీసెస్ చారిటీస్లోని చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
-ఈ కార్యక్రమంలో వైఎస్ సౌభాగ్యమ్మ, వైఎస్ మనోహర్ రెడ్డి, దివంగత వివేకానందరెడ్డి కుమార్తె సునీత,అల్లుడు రాజశేఖర్ రెడ్డి, ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Update: 2020-05-23 08:21 GMT