వలస కార్మికులకు భోజనం పొట్లాలు పంపిణీ చేసిన రామునాయుడు

పెందుర్తి: లాక్ డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులకు 96వ వార్డు బీజేపీ- జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి గొర్లి రామునాయుడు ఆర్థిక సహాయంతో భోజనం పొట్లాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామునాయుడు మాట్లాడుతూ... వలస కార్మికులు ఒకపక్క పని లేకుండా, మరోపక్క సొంత ఊర్ల కి వెళ్ళకుండా ఇబ్బందులు పడటంతో వారికి తాను ఆహారం అందజేసి పలు సౌకర్యాలు చేసినట్లు తెలిపారు. వీరు సొంత గ్రామాలకు వెళ్లడానికి తాను సహకరిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.


 

Update: 2020-05-20 11:19 GMT

Linked news