నేడు ఎల్‌జీ పాలిమర్స్‌ను సందర్శించనున్న ఎన్జీటీ కమిటీ చైర్మన్‌

విశాఖపట్నం: 

◆ఎల్‌జీ పాలిమర్స్‌ గ్యాస్‌లీక్‌ ఘటనపై విచారణకు జాతీయ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ నియమించిన కమిటీ చైర్మన్‌ జస్టిస్‌ శేషశయనరెడ్డి గురువారం విశాఖ వచ్చారు.

◆ఈ కమిటీలో ముగ్గురు సభ్యుల బృందం మూడు రోజుల క్రితమే ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీని సందర్శించి బాధిత గ్రామాల్లో పర్యటించింది.

కమిటీకి నేతృత్వం వహించే శేషశయనరెడ్డి శుక్రవారం కంపెనీని సందర్శించి ప్రమాద కారణాలపై విచారణ చేపడతారు.

◆అనంతరం బాధిత గ్రామాల్లో పర్యటించి అధికారులతో భేటీ కానున్నారు.

Update: 2020-05-15 05:51 GMT

Linked news