నేడు ఎల్జీ పాలిమర్స్ను సందర్శించనున్న ఎన్జీటీ కమిటీ చైర్మన్
విశాఖపట్నం:
◆ఎల్జీ పాలిమర్స్ గ్యాస్లీక్ ఘటనపై విచారణకు జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ నియమించిన కమిటీ చైర్మన్ జస్టిస్ శేషశయనరెడ్డి గురువారం విశాఖ వచ్చారు.
◆ఈ కమిటీలో ముగ్గురు సభ్యుల బృందం మూడు రోజుల క్రితమే ఎల్జీ పాలిమర్స్ కంపెనీని సందర్శించి బాధిత గ్రామాల్లో పర్యటించింది.
కమిటీకి నేతృత్వం వహించే శేషశయనరెడ్డి శుక్రవారం కంపెనీని సందర్శించి ప్రమాద కారణాలపై విచారణ చేపడతారు.
◆అనంతరం బాధిత గ్రామాల్లో పర్యటించి అధికారులతో భేటీ కానున్నారు.
Update: 2020-05-15 05:51 GMT