పెన్నా నది ఒడ్డున నాగేశ్వరుని గుడి దర్శనాలు నిషేధం

నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పెరుమాళ్ళపాడు గ్రామం వద్ద ఇసుక లో కూరుకుపోయి బయటకు తీసిన నాగేశ్వర స్వామి శివాలయం ను ప్రజల సందర్శన తాకిడి ఎక్కువ కావడంతో దేవాలయం కు వెళ్లేందుకు నిషేధిస్తూ ఆలయానికి వెళ్లేందుకు ఉన్న ప్రధాన రహదారిని ముళ్ళకంప తో మూసేసిన అధికారులు.. పెన్నా బ్రిడ్జి దాటిన వెంటనే ప్రత్యేక పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేసి ఎవరిని ఆ ఆలయ పరిసర ప్రాంతాలకు వెళ్లి వచ్చేందుకు నిరాకరిస్తూ వచ్చే భక్తులను నిలుపుదల చేస్తున్న పోలీసులు...

*ఆలయ స్థలాలను క్షుణ్నంగా పరిశీలించి గుడిని పూర్తిస్థాయిలో ప్రత్యేక పద్ధతిలో బయటికి తీసే వరకు ఎవరిని ఆలయ పరిసర ప్రాంతాలకు వెళ్లకుండా దేవాలయం వద్ద కూడా ముళ్ల కంచెను ఏర్పాటు చేసిన గ్రామస్థులు..

Update: 2020-06-21 03:37 GMT

Linked news