PM Kisan Yojana 22nd Installment: రైతులకు గుడ్ న్యూస్.. ఫిబ్రవరిలోనే పీఎం కిసాన్ 22వ విడత? మీ పేరు లిస్ట్లో ఉందో లేదో ఇలా చెక్ చేయండి!
PM Kisan Yojana 22nd Installment: దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఎదురుచూస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-Kisan) 22వ విడత నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది.
PM Kisan Yojana 22nd Installment: దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఎదురుచూస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-Kisan) 22వ విడత నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. సాగు ఖర్చుల కోసం ఏటా మూడు విడతల్లో రూ. 6,000 అందిస్తున్న ఈ పథకంలో భాగంగా, తదుపరి రూ. 2,000 నగదును ఫిబ్రవరి నెలలోనే రైతుల ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
అనర్హుల ఏరివేతలో భాగంగా కేంద్ర ప్రభుత్వం లబ్ధిదారుల జాబితాను ఎప్పటికప్పుడు ప్రక్షాళన చేస్తోంది. కేవలం చిన్న, సన్నకారు రైతులకు మాత్రమే ఈ లబ్ధి చేకూరనుంది. ముఖ్యంగా ఒకే కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఇ-కేవైసీ (e-KYC) పూర్తి చేయని వారు, ప్రభుత్వ ఉద్యోగులు, నెలకు రూ. 10 వేల కంటే ఎక్కువ పెన్షన్ పొందే వారు ఈ పథకానికి అనర్హులుగా ప్రకటించబడ్డారు.
స్టేటస్ చెక్ చేసుకునే విధానం: రైతులు తమ మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా సులభంగా తమ పేరు జాబితాలో ఉందో లేదో తెలుసుకోవచ్చు:
ముందుగా అధికారిక వెబ్సైట్ pmkisan.gov.in ఓపెన్ చేయాలి.
హోమ్ పేజీలో 'Know Your Status' అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి.
మీ రిజిస్ట్రేషన్ నంబర్ను నమోదు చేయాలి. (ఒకవేళ నంబర్ తెలియకపోతే 'Know Your Registration Number' ద్వారా తెలుసుకోవచ్చు).
అనంతరం స్క్రీన్పై కనిపించే క్యాప్చా (Captcha) కోడ్ను ఎంటర్ చేయాలి.
చివరగా 'Get Data' బటన్ ప్రెస్ చేస్తే, మీ పేమెంట్ స్టేటస్ మరియు అర్హత వివరాలు స్క్రీన్పై కనిపిస్తాయి.
అధికారిక వెబ్సైట్ మాత్రమే కాకుండా, 'PM Kisan' మొబైల్ యాప్ ద్వారా కూడా రైతులు తమ వివరాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవచ్చు. గడువులోగా ఇ-కేవైసీ పూర్తి చేసిన వారికి మాత్రమే నిధులు జమ అవుతాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు.