బ్యాంక్ డిపాజిట్లపై ఇన్సూరెన్స్ కవర్ పెంచిన కేంద్రం

* రూ.లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచుతూ నిర్ణయం

Update: 2021-12-12 16:00 GMT

బ్యాంక్ డిపాజిట్లపై ఇన్సూరెన్స్ కవర్ పెంచిన కేంద్రం

Narendra Modi: బ్యాంక్ డిపాజిట్లపై ఇన్సూరెన్స్ కవరేజీ పెంచేందుకే ప్రజలు తనను ప్రధానిని చేశారన్నారు ప్రధాని మోడీ. ఇవాళ డిపాజిటర్స్ ఫస్ట్ కార్యక్రమంలో ప్రసంగించిన మోడీ బ్యాంక్ డిపాజిట్లపై ఇన్సూరెన్స్ కవరేజీ పెంచినట్లు ప్రకటించారు. ఇప్పటి వరకూ లక్ష ఇన్సూరెన్స్ ఉన్న పరిధిని ఐదు లక్షలకు పెంచింది.

బ్యాంకులు దివాలా తీసినా నష్టాల్లో నడుస్తున్నా డిపాజిటర్ల సొమ్ములో 5లక్షల వరకూ ఇన్సూరెన్స్ ఉంటుందని తెలిపారు. తాను సీఎంగా ఉన్నప్పుడు ఇదే అంశంపై పోరాడానని, కానీ ఫలితం లేకపోయిందన్నారు. ఈ సందర్భంగా తనను ప్రజలు బీమా కవరేజీ పెంచేందుకే ప్రధానిని చేశారని వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News