Tirumala: శనివారం వేంకటేశ్వరుని పూజ ఎందుకు ప్రత్యేకం? కలియుగంలో 'వేంకట' అనే పేరుకు అర్థం ఏమిటి?
శనివారం శ్రీ వేంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. ఈ రోజు ఉపవాసం చేయడం, పూజలు నిర్వహించడం ద్వారా భక్తులు అనేక శుభఫలాలు పొందుతారని నమ్మకం. కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వరుడు భక్తుల పాపాలను తొలగించి మోక్ష మార్గాన్ని ప్రసాదిస్తాడని విశ్వాసం.
Tirumala: శనివారం వేంకటేశ్వరుని పూజ ఎందుకు ప్రత్యేకం? కలియుగంలో 'వేంకట' అనే పేరుకు అర్థం ఏమిటి?
శనివారం శ్రీ వేంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. ఈ రోజు ఉపవాసం చేయడం, పూజలు నిర్వహించడం ద్వారా భక్తులు అనేక శుభఫలాలు పొందుతారని నమ్మకం. కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వరుడు భక్తుల పాపాలను తొలగించి మోక్ష మార్గాన్ని ప్రసాదిస్తాడని విశ్వాసం.
"కలౌ వేంకటనాధాయ" అన్న శ్లోకం ప్రకారం, కలియుగంలో “వేం” అంటే పాపాలు, “కట” అంటే నాశనం చేయువాడు. అందువల్లే ఆయనను “వేంకటేశ్వరుడు” అని పిలుస్తారు. భక్తులు గోవిందా అని పిలిస్తే, ఆపదలో ఉన్నవారిని రక్షించే ఆపద్బాంధవుడు శ్రీనివాసుడు వెంటనే కాపాడతాడని విశ్వాసం ఉంది.
శనివారం పూజ ప్రత్యేకతలు
గ్రహశాంతి: శనివారం రోజు వెంకటేశ్వరుని ఆరాధిస్తే శని గ్రహ ప్రభావం తగ్గుతుందని పురాణ విశ్వాసం. శనిదేవుడే ఈ వరం శ్రీనివాసుడికి ఇచ్చాడని చెబుతారు.
పవిత్ర సంఘటనలు:
శ్రీనివాసుని తొలి దర్శనం భక్తులకు శనివారమే లభించింది.
తొండమాన్ చక్రవర్తికి ఆలయ నిర్మాణ ఆజ్ఞ శనివారమే ఇచ్చారు.
స్వామి తొలిసారిగా ఆలయంలో ప్రవేశించిన రోజు కూడా శనివారమే.
పద్మావతి అమ్మవారిని స్వామి వివాహం చేసుకున్నది కూడా ఈ రోజు.
సుదర్శన చక్రం (చక్రత్తాళ్వార్) ఉద్భవించినది కూడా శనివారమే.
శనివారం పూజల ఫలితాలు
శ్రీ వేంకటేశ్వరుని ఆరాధన చేయడం వల్ల:
శని దోషాలు తొలగుతాయి.
అప్పుల బాధలు తగ్గుతాయి.
పిల్లలకు కలిగే ఆపదల నుండి రక్షణ లభిస్తుంది.
ఊహించని అవాంతరాలు తొలగుతాయి.
భక్తులు శాంతి, ఆరోగ్యం, సంపదను పొందుతారు.
శ్రీనివాసుని కథ
పద్మ పురాణం ప్రకారం, భృగు మహర్షి విష్ణువును పరీక్షించడానికి ఆయన వక్షస్థలాన్ని తన్నగా, లక్ష్మీదేవి కోపంతో వైకుంఠాన్ని విడిచి భూలోకానికి వస్తుంది. ఆమె వెనకే శ్రీమహావిష్ణువు కూడా వచ్చి తిరుమల కొండపై వాసం చేస్తాడు. ఇక్కడే ఆయన కుబేరుడి నుండి అప్పు తీసుకొని పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకుంటాడు. ఆ తరువాత లక్ష్మీదేవి తిరిగి వచ్చి విష్ణువును కలవడం వలన స్వామి శిల రూపంలోకి మారతాడు. అప్పటి నుండి ఆయన తిరుమలలో వేంకటేశ్వర స్వామిగా భక్తుల ఆరాధన పొందుతున్నాడు.