తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన

Update: 2019-04-17 01:44 GMT

శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సుప్రభాతసేవలో స్వామివారి సన్నిధికి వచ్చిన ఆయన దేవదేవుణ్ణి దర్శించుకున్నారు. దర్శనం కోసం మంగళవారం తిరుమలకు విచ్చేసారు ఆయన. శ్రీవారిదర్శనం కోసం వచ్చిన సిరిసేనకు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఛైర్మెన్ పుట్టా సుధాకర్ యాదవ్, ఆలయ అధికారులు, ప్రధానార్చకులు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం సిరిసేనకు తీర్ధ ప్రసాదాలు అందజేశారు ప్రధానార్చకులు. 

Similar News