Lakshmi Devi: ఉదయం నిద్రలేచిన వెంటనే ఈ పనులు చేస్తే.. లక్ష్మీదేవి అనుగ్రహం మీ సొంతం..!
Lakshmi Devi: జ్యోతిష్యం ప్రకారం, ఉదయం నిద్ర లేచిన తర్వాత కొన్ని ప్రత్యేకమైన నివారణలు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు. మీరు ఉదయం ఈ 6 పనులు చేస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ ఇంట్లోనే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
Lakshmi Devi: ఉదయం నిద్రలేచిన వెంటనే ఈ పనులు చేస్తే.. లక్ష్మీదేవి అనుగ్రహం మీ సొంతం..!
Lakshmi Devi: జ్యోతిష్యం ప్రకారం, ఉదయం నిద్ర లేచిన తర్వాత కొన్ని ప్రత్యేకమైన నివారణలు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు. మీరు ఉదయం ఈ 6 పనులు చేస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ ఇంట్లోనే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. హిందూ మతంలో లక్ష్మీదేవిని సంపదకు దేవత అని పిలుస్తారు. లక్ష్మీదేవి ఆశీస్సులు ఉన్న వ్యక్తి లేదా ఇల్లు ఆర్థిక సమస్యలను అస్సలు ఎదుర్కోదని నమ్ముతారు. జ్యోతిష్యం ప్రకారం, ఉదయం నిద్రలేచిన తర్వాత ఈ పరిహారాలు పాటిస్తే లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది.
అరచేతుల దర్శనం:
ఉదయం నిద్రలేవగానే ముందుగా మీ అరచేతులను చూడాలి. అరచేతులను చూసిన తర్వాత లక్ష్మీదేవి మంత్రాన్ని జపించాలి. ఎందుకంటే జ్యోతిష్యం ప్రకారం, అరచేతులలో లక్ష్మీదేవి, సరస్వతి దేవి , బ్రహ్మ దేవుడు నివసిస్తారని అందరి నమ్మకం.
సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం:
ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత రాగి పాత్రలో సింధూరం, పువ్వులు వేసి సూర్యుడికి అర్ఘ్యం అర్పించాలి. అలాగే "ఓం సూర్యాయ నమః, ఓం భనవే నమః, ఓం ఖగాయ నమః" అనే మంత్రాన్ని జపించాలి.
తులసి పూజ:
ఉదయం నిద్రలేచిన తర్వాత స్నానం చేసి తులసి మొక్కను పూజించాలి. తులసి మొక్కకు నీటిని కూడా సమర్పించాలి. తులసిలో లక్ష్మీదేవి నివసిస్తుందని మతపరమైన నమ్మకం. కనుక తులసి మొక్కను రోజూ పూజించడం వల్ల లక్ష్మీదేవి ఇంటిలో నివసిస్తుందని అంటారు.
ప్రధాన ద్వారం వద్ద ముగ్గు:
ఉదయం నిద్రలేచి స్నానం చేసిన తర్వాత ఇంటి ప్రధాన ద్వారం వద్ద నీరు చల్లి ముగ్గు వేయండి. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుందని నమ్ముతారు. అలాగే, దీనితో పాటు ఉదయం ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం కూడా వెలిగించాలి. తద్వారా సానుకూల శక్తి ఇంట్లోకి ప్రవేశించి లక్ష్మీదేవి అక్కడ నివసిస్తుంది.
ప్రధాన ద్వారం వద్ద నీటి పాత్ర :
ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఒక రాగి పాత్రలో నీరు పోసి పెట్టండి. అందులో ఎరుపు రంగు పువ్వులు వేయడం వలన లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
ప్రధాన ద్వారంపై స్వస్తిక్:
హిందూ మత విశ్వాసం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారంపై స్వస్తిక్ వేయడం చాలా శుభప్రదం. ఎందుకంటే ఇంట్లోకి సానుకూల శక్తిని ప్రవేశించేలా చేస్తుందని నమ్మకం. అంతేకాదు ఇంటి నుంచి ప్రతికూల శక్తిని దూరంగా ఉంచుతుంది. ఉదయం నిద్రలేచిన తర్వాత ప్రధాన ద్వారంపై స్వస్తిక్ వేయడం వలన లక్ష్మీదేవి ఇంట్లో నివసిస్తుంది.