ఉద్ధృతంగా కృష్ణా, గోదావరి నదులు | ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక

కృష్ణా, గోదావరి నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ, భద్రాచలం వద్ద నీటిమట్టం పెరుగుతోంది. వరద పరిస్థితులపై ప్రభుత్వ సూచనలు, ప్రజలకు జాగ్రత్తలు.

Update: 2025-08-19 09:19 GMT

Krishna and Godavari Rivers in Spate | First Danger Alert at Prakasam Barrage

బంగాళాఖాతం‌లో ఏర్పడిన వాయుగుండం మంగళవారం తెల్లవారుజామున ఒడిశా గోపాల్‌పూర్ సమీపంలో తీరం దాటింది. ప్రస్తుతం అది బలహీనపడుతున్నప్పటికీ, దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

ప్రకాశం బ్యారేజీ వద్ద హెచ్చరిక

  1. కృష్ణా నదిలో భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది.
  2. ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
  3. ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో కలిపి 4.01 లక్షల క్యూసెక్కులు.
  4. లొతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

గోదావరిలో ఉద్ధృతి – భద్రాచలంలో నీటిమట్టం పెరుగుదల

  1. భద్రాచలం వద్ద నీటిమట్టం 36.6 అడుగులు.
  2. ధవళేశ్వరం వద్ద ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 8.23 లక్షల క్యూసెక్కులు.
  3. గోదావరి, కృష్ణా, తుంగభద్ర పరీవాహక ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు.
  4. వాగులు, కాలువలు పొంగిపొర్లుతున్నందున వాటిని దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరిక.

శ్రీశైలం & నాగార్జునసాగర్ డ్యామ్ పరిస్థితి

  1. శ్రీశైలం డ్యామ్ – ఇన్‌ఫ్లో 3.42 లక్షల క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 4.04 లక్షల క్యూసెక్కులు.
  2. నాగార్జునసాగర్ డ్యామ్ – ఇన్‌ఫ్లో 3.71 లక్షల క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 3.98 లక్షల క్యూసెక్కులు.

కలెక్టర్లకు ప్రత్యేక ఆదేశాలు

  1. ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ స్పెషల్ సీఎస్ జి. జయలక్ష్మి 13 జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
  2. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి.
  3. అవసరమైతే ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలి.
  4. NDRF, SDRF బృందాలు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు.
  5. నిత్యావసర వస్తువులు, మందులు, శానిటేషన్ మెటీరియల్స్ అందుబాటులో ఉండేలా చర్యలు.

ప్రస్తుతం కృష్ణా, గోదావరి నదుల ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో, లొతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు పునరావృతంగా హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News