ఆనంతపురం జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు.. నామినేషన్లు అడ్డుకున్న వైసీపీ శ్రేణులు

Update: 2020-03-11 10:45 GMT

అనంతపురం జిల్లాలో స్థానిక సంస్థల నామినేషన్ల సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ, ఇతర పార్టీలకు చెందిన అభ్యర్ధులు నామినేషన్లు వేయకుండా వైసీపీ శ్రేణులు అడ్డుకున్నారు. ధర్మవరం నియోజవర్గం తాడిమర్రి బత్తలపల్లిలో నామినేషన్లు వేసేందుకు వచ్చిన వారిపై దాడికి దిగారు. జనసేన అభ్యర్ధి మధుసూదన్ రెడ్డి, ఓబులాపురం ఎంపీటీసీగా నామినేషన్ వేసేందుకు వచ్చిన అభ్యర్ధి భర్త చెన్న కేశవులుపై దాడి చేశారు. నామినేషన్ పత్రాలు తీసుకుని చించి వేశారు. వైసీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీ చార్జి చేశారు. 

Full View

 

Tags:    

Similar News